"మగధీర''కు కరువైన బయ్యర్లు? (Jun 09 09)

గీతా ఆర్ట్స్ పతాకంపై, రామ్ చరణ్‍ తేజ హీరోగా, కాజల్‍ అగర్వాల్‍ హీరోయిన్‌గా, రాజమౌళి దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం "మగధీర". ఈ చిత్రానికి అనుకున్న దానికన్నా బడ్జెట్‍ భారీగా అయినట్లు సమాచారం. సినీ జనాల మాట ప్రకారం ఈ చిత్రానికి 38 కోట్లు ఖర్చయిందట.ఈ బడ్జెట్‍తో ఓ మోస్తరు సినిమాలు సుమారు మూడు తీయవచ్చు. ఇంత భారీ బడ్జెట్‍తో నిర్మించిన ఈ చిత్రాన్ని కొనటానికి బయ్యర్లూ, డిస్ట్రిబ్యూటర్లూ పెద్దగా ఆసక్తి చూపించకపోవటంతో, ఈ చిత్రాన్ని తానే సొంతంగా విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ సినిమా సూపర్ హిట్టయితే ఒ.కె. కానీ ఏమైనా అటూ ఇటూ అయితే మాత్రం పెట్టిన డబ్బు తిరిగి రావటం కష్టమంటున్నారు సినీ పండితులు.

More Telugu Cinema News, Reviews & Gossips

DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.